డ్యూయల్ సిటిజెన్ షిప్ (ద్వంద్వ పౌరసత్వం) కోసం.. ప్రవాస భారతీయులు (ఇండియన్ డయసపోరా) చాలా కాలంగా కోరుతున్నారు. మరోవైపు భారత రాజ్యాంగం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించడం లేదు. దీంతో మధ్యేమార్గంగా భారత పౌరసత్వ (సవరణ) చట్టం, 2005 ద్వారా ఓసీఐ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. కొన్ని నిబంధనలకు లోబడి ఓసీఐ కలిగిన వారు భారత పౌరులతో సమానంగా అనేక హక్కులను పొందవచ్చు. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ నేపథ్యం ఉన్న వారికి మాత్రం అర్హత లేక పోవడం గమనార్హం.