తొలి దశలో పశ్చిమ యూపీలో ప్రధానంగా వార్తల్లో ఉన్న నియోజకవర్గాలైన కైరానా, థాన్భవన్, సర్దానా, ఆగ్రా రూరల్, మథుర, నొయిడా, హస్తినాపూర్ పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో యోగి క్యాబినెట్లోని మంత్రులు బరిలో ఉన్నారు. మంత్రులు శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గర్గ్, చౌధురి లక్ష్మీ నారాయణ్లు ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వీళ్లలో ఇప్పుడు టెన్షన్ టెన్షన్ నెలకొంది.