తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 10వేల 613 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 108 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 47 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 9 కేసులు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 8 కేసులు, ఖమ్మం జిల్లాలో 6 కేసులు వెల్లడయ్యాయి.