► కాసేపట్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర సమాచార మంత్రి ఠాకూర్తో భేటీ కానున్నారు.
► కేంద్రమంత్రి గడ్కరీతో సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది.
► రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.
► విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్ తయారీ అంశంపై చర్చించారు.
► విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని సీఎం జగన్ కేంద్ర మంత్రికి తెలిపారు.
► సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్కారిడర్ ప్రాజెక్టులకు సమీపనుంచి ఈ రోడ్డు వెళ్తుందని సీఎం జగన్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
► భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందని సీఎం జగన్ కేంద్రమంత్రికి వివరించారు.
►విశాఖ నగరంలో వాహనరద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని సీఎం జగన్ కోరారు.
►సుమారు గంటపాటు సమావేశం కొనసాగింది.