మైనర్ విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆ దృశ్యాలను ఇంటర్నెట్లో పోస్టు చేసిన దుండగులను హొసనగర పోలీసులు అరెస్టు చేశారు. వారంబళ్లికి చెందిన సునీల్, ఆయనూరు గ్రామానికి చెందిన సంతోష్లు మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. సచిన్, సుబ్బ, రఘు అనే వ్యక్తులు వారికి సహకరించారు. ఈ ఐదు మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు సునీల్, సంతోష్లు సదరు మైనర్ బాలికకు పరిచయస్తులు. ఇటీవల హొసనగర పట్టణంలోని బస్టాండ్లో ఊరికి వెళ్లేందుకు బాలిక వేచిచూస్తోంది. ఈ సమయంలో కారులో వచ్చిన నిందితులు ఇంట్లో దింపుతామని నమ్మించి కారులో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీడియోలు తీసి పోస్ట్ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మృగాళ్లను అరెస్టు చేశారు.