రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోలో విజయ్కు జోడీగా అనన్య పాండే నటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆగస్ట్ 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్న లైగర్ టీం ఇటీవలె సాక్షి టీవీతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.