దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్సీ విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి భారత టెస్ట్ కెప్టెన్ ఎవరన్నది అందరి మెదడులని తొలుస్తున్న ప్రశ్న. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని చాలా వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు కపిల్ దేవ్ లాంటి నిఖార్సైన ఆల్ రౌండర్కి టెస్టు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ కీలక వాఖ్యలు చేశాడు. కపిల్ దేవ్ వంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ భారత్కు దొరకకపోతే, తర్వాత ఏమి చేయాలో ఆలోచించి ముందుకు సాగాలని గంభీర్ తెలిపాడు.