మైదానంలో టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ శ్రీలంక జెండాను పట్టుకుని ప్రేక్షకులకు చూపుతోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆసియా కప్ లో భాగంగా నిన్న పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ మ్యాచులో శ్రీలంక 23 పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిశాక గౌతం గంభీర్ శ్రీలంక జెండాను పట్టుకుని మైదానంలోకి వెళ్లారు. ప్రేక్షకులకు శ్రీలంక జెండా చూపారు. దీంతో శ్రీలంక అభిమానులు ఖుషీ అయ్యారు.