జోగులాంబ..! తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో వెలసిన ఈ క్షేత్రానికి అనేక విశిష్టతలున్నాయి. చారిత్రకంగా శైవ క్షేత్రాల్లో అలంపూర్కు ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణ కాశీగా శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతోంది ఈ క్షేత్రం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా.. పావన తుంగభద్రా నది తీరాన జోగులాంబగా వెలసింది అమ్మవారు.