ఏపీలో మరోసారి బ్లేడ్ బ్యాచ్ దాడులకు తెగబడింది. విజయవాడ రూరల్ మండలం గూడవల్లి వద్ద బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేసింది. ఓ లారీ డ్రైవర్ పై దాడికి తెగబడింది. నిద్రపోతున్న లారీ డ్రైవర్ పై బ్లేడ్ తో దాడి చేసి అతని వద్ద ఉన్న రూ.5,500 నగదు..సెల్ ఫోన్ లాక్కుని పరారయ్యారు.రక్తమోడుతున్న లారీ డ్రైవర్ ను గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ వద్ద ఉన్న డబ్బులు లాక్కోవటానికి బ్లేడ్ బ్యాచ్ యత్నించింది. దీంతో డ్రైవర్ ప్రతిఘటించాడు. దీంతో బ్లేడ్ తో దాడి చేసిన నగదు, సెల్ ఫోన్ లాక్కుని పరారయ్యారు బ్లేడ్ బ్యాచ్.